గాల్లో తేలుతూ భోజనం చేయండి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 16, 2018

గాల్లో తేలుతూ భోజనం చేయండి!



మనం సాధారణంగా రెస్టారెంట్కు వెళ్లి ఏసీ రూముల్లోనో, గార్డెన్ ఏరియాల్లోనో, మహా అయితే నీటి కొలను చివర్లో లేదా మధ్యలో కూర్చుని భోజనం చేస్తాం. అయితే బెంగళూరులోని ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. తమ రెస్టారెంట్కు వచ్చే కస్టమర్లను ఖుషీ చేసేందుకు సిద్ధమైంది. భూమికి 160 అడుగుల ఎత్తులో గాల్లో కూర్చుని భోజనం చేసేలా ఏర్పాటు చేసింది. దీనిలో ఒకేసారి 22 మంది కూర్చుని భోజనం చేయొచ్చు. మనకు కావాల్సినవి వడ్డించడానికి  4-5 మంది స్టాఫ్ కూడా వారితో ఉంటారు. ఇక్కడ అరగంట సేపు కూర్చుని భోజనం చేయాలంటే నాలుగు వేల రూపాయలు, గంట సమయానికి ఏడు వేల రూపాయలు చెల్లించుకోవాలి మరి!

No comments:

Post a Comment

Post Bottom Ad