ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని కరీంనగర్ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని తానే స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల నిబంధనల్లోని వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కోర్టు విచారణ చేసింది. అయితే ఈ కేసులో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. గత నెల 27తో స్టే ముగిసింది. దీంతో ఈ నెల 10న నేరుగా హాజరు కావాలని ఏపీ స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని కరీంనగర్ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని తానే స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల నిబంధనల్లోని వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కోర్టు విచారణ చేసింది. అయితే ఈ కేసులో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. గత నెల 27తో స్టే ముగిసింది. దీంతో ఈ నెల 10న నేరుగా హాజరు కావాలని ఏపీ స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
No comments:
Post a Comment