తనను ప్రేమించలేదని 38సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 15, 2018

తనను ప్రేమించలేదని 38సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడు


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ యువకుడు.. యువతిని కత్తితో పొడిచి చంపాడు. ఆమె శరీరంపై మొత్తం 38 కత్తిపోట్లు ఉండటం గమనార్హం. వివరాల్లో కెళ్తే.. కమలేశ్ సాహూ, సుప్రియా జైన్ అనే ఇద్దరూ పన్నెండో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అయితే సుప్రియాను ప్రేమిస్తున్నట్టు కమలేశ్ చెప్పగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. కాగా సుప్రియ తన స్నేహితులతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి కమలేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను ప్రేమించకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటుందని గ్రహించిన కమలేశ్.. ఆమెను అంతమొందించాలని కుట్ర చేశాడు. గత గురువారం రాత్రి
గురువారం రాత్రి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సుప్రియాపై కత్తితో దాడి చేశాడు. ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై 38 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు కమలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad