గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దయ్యాలకు కూడా పెన్షన్లు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వం హయాంలో అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని, దయ్యాలు శ్మశానంలోనే ఉన్నాయన్నారు. చనిపోయినవారి పేర్ల మీద గత ప్రభుత్వాల్లో విపరీతంగా పెన్షన్లు తిన్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆర్థికంగా సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పారు. తాను పాదయాత్రలో చూసిన అనుభవాల ఆధారంగా ఎన్టీఆర్ భరోసా వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. రైతుల రుణమాఫీ కోసం రూ,24,500 కోట్లు కేటాయించామని వెల్లడించారు. వ్యవసాయంలోనూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో పథకాలను తీసుకొచ్చామన్నారు.
No comments:
Post a Comment