వియత్నాం అధ్యక్షుడు కన్నుమూత - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

వియత్నాం అధ్యక్షుడు కన్నుమూత


చైనా పొరుగుదేశం.. వియత్నాంలో విషాదం చోటు చేసుకుంది. వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క్వాంగ్ గత పదిరోజులుగా వియత్నాం రాజధాని హానోయ్ లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం క్వాంగ్ ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. దేశీయ డాక్టర్లతోపాటు విదేశీ డాక్టర్లు కృషి చేసినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారని కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. 61 ఏళ్ల క్వాంగ్ అధ్యక్షుడు కాక ముందు మంత్రిగా పనిచేశారు. 2016 ఏప్రిల్ లో వియత్నాం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ లీడర్ తర్వాత దేశానికి రెండో కమాండర్ క్వాంగే కావడం గమనార్హం. సముద్ర జలాలపై పెత్తనం చేస్తూ పొరుగుదేశాలను భయపెడుతున్న చైనాకు ఎదురొడ్డి నిలిచారు. భారత్ తో సన్నిహిత సంబంధాలను నెలకొల్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad