చేవేళ్ల చెల్లెమ్మ సీటుపై కన్నేసిన దీప బాస్కర్ రెడ్డి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

చేవేళ్ల చెల్లెమ్మ సీటుపై కన్నేసిన దీప బాస్కర్ రెడ్డి


చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధికెక్కిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంపై కన్నేశారు.. కాంగ్రెస్ నేత దీప భాస్కర్ రెడ్డి. 2009లో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి గెలుపొందారు. 2014లో మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో సబిత లోక్ సభకు పోటీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మహేశ్వరం నుంచి సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీ చేస్తారని వార్తలు వస్తుండగా తాజాగా దీప భాస్కర్ రెడ్డి సీన్ లోకి వచ్చారు. మహేశ్వరం సీటును తనకు కేటాయించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీనియర్ నేత జానారెడ్డికి, షబ్బీర్ అలీలకు వినతిపత్రం అందించారు. చాలాకాలం నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేశాను కాబట్టి సీటు తనకే కేటాయించాలంటున్నారు. అయితే మహేశ్వరం నుంచి సబిత ఇంద్రారెడ్డి లేదా ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీ చేస్తాడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 


No comments:

Post a Comment

Post Bottom Ad