తెలంగాణలో అదికార పార్టీ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల కిందట ఆపధ్ధర్మ సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనసభకు పోటీ చేసేవారి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రమేశ్ రాథోడ్ కు చోటు దక్కలేదు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ సీటును రమేశ్ రాథోడ్ ఆశించగా రేఖా నాయక్ కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీనిపై ఆరోజే రమేశ్ రాథోడ్ నిరసన స్వరం వినిపించారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి.. రమేష్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు భారీ ఎత్తున అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో అదికార పార్టీ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల కిందట ఆపధ్ధర్మ సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనసభకు పోటీ చేసేవారి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రమేశ్ రాథోడ్ కు చోటు దక్కలేదు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ సీటును రమేశ్ రాథోడ్ ఆశించగా రేఖా నాయక్ కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీనిపై ఆరోజే రమేశ్ రాథోడ్ నిరసన స్వరం వినిపించారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి.. రమేష్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు భారీ ఎత్తున అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment