యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ లో నేడు దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరగనుంది. సూపర్ -4 లో భాగంగా మొదటి మ్యాచులో భారత్.. బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాకిస్థాన్ కూడా తన మొదటి మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ ను ఓడించింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియా కప్ లో లీగ్ దశలోనే శ్రీలంక, హాంగ్ కాంగ్ ఇంటి ముఖం పట్టగా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ -4కు చేరుకున్నాయి. కాగా, భారత జట్టులో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అద్భుత పామ్ లో ఉన్నారు. అంబటి రాయుడు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో లీగ్ మ్యాచులో భారత్ పై ఓడిన పాకిస్థాన్ పైనే ఒత్తిడి అంతా నెలకొంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు దుబాయ్ లో మ్యాచ్ ప్రారంభమవుతుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ లో నేడు దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరగనుంది. సూపర్ -4 లో భాగంగా మొదటి మ్యాచులో భారత్.. బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పాకిస్థాన్ కూడా తన మొదటి మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ ను ఓడించింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియా కప్ లో లీగ్ దశలోనే శ్రీలంక, హాంగ్ కాంగ్ ఇంటి ముఖం పట్టగా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సూపర్ -4కు చేరుకున్నాయి. కాగా, భారత జట్టులో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అద్భుత పామ్ లో ఉన్నారు. అంబటి రాయుడు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో లీగ్ మ్యాచులో భారత్ పై ఓడిన పాకిస్థాన్ పైనే ఒత్తిడి అంతా నెలకొంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు దుబాయ్ లో మ్యాచ్ ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment