ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దర్గామిట్టలో బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రొట్టెల పండుగలో పాల్గొంటారు. పవన్ కల్యాణ్ తోపాటు ప్రముఖ హాస్య నటుడు, పవన్ స్నేహితుడు అలీ కూడా రొట్టెల పండుగకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అందులోనూ ఆదివారం సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. భక్తుల రద్దీకి తోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వస్తుండటంతో తొక్కిసలాట చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పవన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దర్గామిట్టలో బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రొట్టెల పండుగలో పాల్గొంటారు. పవన్ కల్యాణ్ తోపాటు ప్రముఖ హాస్య నటుడు, పవన్ స్నేహితుడు అలీ కూడా రొట్టెల పండుగకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అందులోనూ ఆదివారం సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. భక్తుల రద్దీకి తోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వస్తుండటంతో తొక్కిసలాట చోటు చేసుకోకుండా పోలీసులు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పవన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
No comments:
Post a Comment