ఈ ఏడాది టాలీవుడ్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన రంగస్థలం మరో రికార్డు సృష్టించింది. సినిమా టికెట్ల బుకింగ్ సంస్థ.. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అతిపెద్ద విజయాలు సాధించిన చిత్రాల్లో దేశంలోనే రంగస్థలం 11వ స్థానంలో నిలిచింది. సౌతిండియా వరకు చూసుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా భారీ హిట్ లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో తొమ్మిది బాలీవుడ్ చిత్రాలే ఉన్నాయి. టాప్ టెన్ లో హాలీవుడ్ చిత్రం 'ఎవెంజర్స్' కూడా చోటు దక్కించుకుంది. ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన సంజూ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానం దీపికా పదుకోణ్ టైటిల్ రోల్ పోషించిన పద్మావత్ నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం 29వ స్థానంలోనూ, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను 30వ స్థానంలోనూ నిలిచాయి.
ఈ ఏడాది టాలీవుడ్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన రంగస్థలం మరో రికార్డు సృష్టించింది. సినిమా టికెట్ల బుకింగ్ సంస్థ.. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అతిపెద్ద విజయాలు సాధించిన చిత్రాల్లో దేశంలోనే రంగస్థలం 11వ స్థానంలో నిలిచింది. సౌతిండియా వరకు చూసుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా భారీ హిట్ లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో తొమ్మిది బాలీవుడ్ చిత్రాలే ఉన్నాయి. టాప్ టెన్ లో హాలీవుడ్ చిత్రం 'ఎవెంజర్స్' కూడా చోటు దక్కించుకుంది. ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన సంజూ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానం దీపికా పదుకోణ్ టైటిల్ రోల్ పోషించిన పద్మావత్ నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం 29వ స్థానంలోనూ, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను 30వ స్థానంలోనూ నిలిచాయి.
No comments:
Post a Comment