నకిలీ నిరోధించేందుకు వాట్సాప్తో చేతులు కలిపిన జియో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

నకిలీ నిరోధించేందుకు వాట్సాప్తో చేతులు కలిపిన జియో!


మెసేజింగ్ యాప్ వాట్సాప్‌, టెలికాం సంస్థ జియో భారత్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా కలిసి పనిచేస్తున్నాయి. జియోఫోన్‌, జియోఫోన్‌ 2లో ఈ చాట్‌ యాప్‌కు అనుమతించిన రిలయన్స్‌ జియో, నకిలీ మెసేజ్‌లు, రూమర్లు వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ మెసేజ్లతో మూక దాడులు జరిగి, దాదాపు 30 మందికి పైగా వ్యక్తులు చనిపోయిన తర్వాత నకిలీ మెసేజ్‌లను నిర్మూలించడానికి వెంటనే వాట్సాప్‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించడం కోసం ప్రింట్‌, రేడియో యాడ్‌ క్యాంపెయిన్లను, యాప్‌లో కొత్త ఫీచర్లను తీసుకురావడం, డిజిటల్‌ ఎంపవర్మెంట్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం వంటి వాటిని వాట్సాప్ చేపడుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad