త్వరలో ఫేస్ లాగిన్ ఫీచర్ ప్రవేశపెట్టబోతున్న పేటీఎం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

త్వరలో ఫేస్ లాగిన్ ఫీచర్ ప్రవేశపెట్టబోతున్న పేటీఎం


ఆన్లైన్ లో వివిధ వస్తువులు, సినిమా టికెట్లు, విమాన టికెట్ల అమ్మకం, బిల్లులు చెల్లింపు, రీచార్జ్ తదితర సేవలను అందిస్తున్న పేటీఎం త్వరలో ఫేస్ లాగిన్ ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్నట్టు వెల్లడించింది. వినియోగదారుల డేటా హ్యాకింగ్ కు గురవకుండా చూడటమే కోసమే ఫేస్ లాగిన్ ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్టు స్పష్టీకరించింది. ఈ మేరకు బుధవారం పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపికా అబాట్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ముందస్తు పరీక్షల్లో భాగంగా పదివేల మంది ముఖాలను పరీక్షించామని నూటికి నూరు శాతం సరైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పేటీఎంలో ఫేస్ లాగిన్ ఫీచర్ ను చూడొచ్చని వివరించారు. ముందుగా పేటీఎం యాప్ లో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. ఫేస్ లాగిన్ ఫీచర్ తో వినియోగదారుల చెల్లింపులు, నగదు బదిలీలు మరింత సురక్షితంగా జరుగుతాయని తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad