దాదాపు నాలుగొందల ఏళ్ల క్రితం పోర్చుగల్ సమీపంలో అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన ఓ ఓడ శకలాలను మెరైన్ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. నాడు మునిగిపోయిన ఓడ కోసం పోర్చుగల్ ప్రభుత్వం, నోవా యూనివర్సిటీకి పురాతత్వ శాస్త్రవేత్తలతో కలసి పదేళ్ల క్రితం అన్వేషణ ఆరంభించగా తాజాగా ఇప్పుడు ఓడ శకలాలు లభించాయి. ఈ ఓడ భారత్ నుంచి పోర్చుగల్ కు వెళ్తుండగా మునిగిపోయిందని అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ వారితోపాటు పోర్చుగీసువారు, ఫ్రెంచ్ వారు, డచ్చివారు కూడా భారతదేశాన్ని పాలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచానికి సుగంధ ద్రవ్యాల కేంద్రంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలు, అత్యంత విలువైన కళా ఖండాలు, అత్యంత నైపుణ్యంతో తయారుచేసిన భారతీయ పింగాణీ వస్తువులను వేసుకుని బయలుదేరిన ఓడ తీరం చేరేలోగానే సముద్రంలో మునిగిపోయింది. తాజా శకలాల్లో వీటిని గుర్తించారు. అట్లాంటిక్ సముద్రంలో టేగస్ నది కలిసే చోట తవ్వకాలు చేపట్టగా ఓట బయపడిందని పోర్చుగల్ అధికారులు చెప్పారు.
దాదాపు నాలుగొందల ఏళ్ల క్రితం పోర్చుగల్ సమీపంలో అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన ఓ ఓడ శకలాలను మెరైన్ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. నాడు మునిగిపోయిన ఓడ కోసం పోర్చుగల్ ప్రభుత్వం, నోవా యూనివర్సిటీకి పురాతత్వ శాస్త్రవేత్తలతో కలసి పదేళ్ల క్రితం అన్వేషణ ఆరంభించగా తాజాగా ఇప్పుడు ఓడ శకలాలు లభించాయి. ఈ ఓడ భారత్ నుంచి పోర్చుగల్ కు వెళ్తుండగా మునిగిపోయిందని అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ వారితోపాటు పోర్చుగీసువారు, ఫ్రెంచ్ వారు, డచ్చివారు కూడా భారతదేశాన్ని పాలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచానికి సుగంధ ద్రవ్యాల కేంద్రంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలు, అత్యంత విలువైన కళా ఖండాలు, అత్యంత నైపుణ్యంతో తయారుచేసిన భారతీయ పింగాణీ వస్తువులను వేసుకుని బయలుదేరిన ఓడ తీరం చేరేలోగానే సముద్రంలో మునిగిపోయింది. తాజా శకలాల్లో వీటిని గుర్తించారు. అట్లాంటిక్ సముద్రంలో టేగస్ నది కలిసే చోట తవ్వకాలు చేపట్టగా ఓట బయపడిందని పోర్చుగల్ అధికారులు చెప్పారు.
No comments:
Post a Comment