ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రాణభయంతో భయపడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరించడం, మావోయిస్టులకు సహాయం చేసేవారిని వేధించడం వంటి పనులు చేస్తున్నారని వారిపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టులు కూడా పలుమార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలిసింది. అయినా పెడచెవినపెట్టడంతో కిడారి, సివేరిలను మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టుల హిట్ లిస్టులో గిడ్డి ఈశ్వరితోపాటు నర్సీపట్నం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల వీరిద్దరికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రాణభయంతో భయపడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరించడం, మావోయిస్టులకు సహాయం చేసేవారిని వేధించడం వంటి పనులు చేస్తున్నారని వారిపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టులు కూడా పలుమార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలిసింది. అయినా పెడచెవినపెట్టడంతో కిడారి, సివేరిలను మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టుల హిట్ లిస్టులో గిడ్డి ఈశ్వరితోపాటు నర్సీపట్నం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల వీరిద్దరికి గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment