ప్రముఖ దర్శకుడు తేజ్ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. కాజల్ అగర్వాల్. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత మగధీర, చందమామ, డార్లింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, నాయక్, బిజినెస్ మెన్, బృందావనం, టెంపర్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి తదితర చిత్రాలతో మంచి హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ చిత్రం 'క్వీన్' రీమేక్ గా తెరకెక్కుతున్న కోలీవుడ్ చిత్రం 'పారిస్.. పారిస్'లో నటిస్తోంది. ఇది కాకుండా తెలుగులో అగ్ర కథానాయికలతో సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కంబోడియాలోని అంగోర్ వాట్ దేవాలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండతో కలసి ఆ ప్రదేశాలన్నిటిని చుట్టేస్తోంది. అంగోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేవాలయాన్ని సందర్శించింది. అంతేకాకుండా హీరో సాయిశ్రీనివాస్ మెడపైకి ఎక్కి కూర్చుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది.
ప్రముఖ దర్శకుడు తేజ్ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. కాజల్ అగర్వాల్. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత మగధీర, చందమామ, డార్లింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, నాయక్, బిజినెస్ మెన్, బృందావనం, టెంపర్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి తదితర చిత్రాలతో మంచి హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ చిత్రం 'క్వీన్' రీమేక్ గా తెరకెక్కుతున్న కోలీవుడ్ చిత్రం 'పారిస్.. పారిస్'లో నటిస్తోంది. ఇది కాకుండా తెలుగులో అగ్ర కథానాయికలతో సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కంబోడియాలోని అంగోర్ వాట్ దేవాలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండతో కలసి ఆ ప్రదేశాలన్నిటిని చుట్టేస్తోంది. అంగోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేవాలయాన్ని సందర్శించింది. అంతేకాకుండా హీరో సాయిశ్రీనివాస్ మెడపైకి ఎక్కి కూర్చుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది.
No comments:
Post a Comment