ఐకియాలో కేక్ లో పురుగు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

ఐకియాలో కేక్ లో పురుగు!


హైదరాబాద్లో భారీ స్థాయిలో ఇటీవల ఏర్పాటు చేసిన స్వీడిష్‌ ఫర్నీచర్‌ కంపెనీ ఐకియాలో వెజ్‌ బిర్యానీలో గొంగళి పురుగు రేపిన సంగతి మరవకముందే మరో పురుగు బయటపడింది. గతంలో వెజ్‌ బిర్యానీలో గొంగళి పురుగు రాగా ఈ సారి చాక్లెట్‌ కేక్‌లో, అది కూడా బతికున్న పురుగు వచ్చిన సంఘటన వెలుగు చూసింది. కిషోర్‌ అనే కస్టమర్‌ ఈ నెల 12న తన కూతురితో కలిసి ఐకియా రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కిషోర్‌ కూతురు చాక్లెట్‌ కేక్‌ని ఆర్డర్‌ చేసింది. తీరా కేక్‌ని తీసుకొచ్చాక చూస్తే దాని మీద ఓ పురుగు పాకుతుంది. ఇది గమనించిన కిషోర్‌ తన ఆర్డర్‌ కాపీ, బిల్‌ పే చేసిన కాపీతో పాటు చాక్లెట్‌ మీద ఉన్న పురుగును కూడా వీడియో తీసి మున్సిపల్‌ అధికారులకు, హైదరాబాద్‌ పోలీస్‌లకు ట్యాగ్‌ చేస్తూ తన ట్విటర్‌ అకౌంట్లో పోస్టు చేశాడు. జీహెచ్‌ఎంసీ అధికారులు తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని రెండు రోజుల క్రితం మరో వీడియో తెలియజేశాడు. దాంతో స్పందించిన మున్సిపల్‌ అధికారులు ఐకియాకు 5 వేల రూపాయల జరిమానా విధించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad