కృష్ణా జిల్లాలో భార్యను కత్తితో దారుణంగా పొడిచిన భర్త! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

కృష్ణా జిల్లాలో భార్యను కత్తితో దారుణంగా పొడిచిన భర్త!


ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలంలో  భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే కత్తితో దారుణంగా పొడిచాడు. వేంకటాయపాలెంకు చెందిన భుక్యా భీముడు తన భార్య కనకమ్మపై అనుమానంతో కత్తితో విచక్షణా రహితంగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన కనకమ్మ పరిస్థితి విషమంగా మారటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భుక్కా భీముని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad