హరియాణాలోని కురుక్షేత్రలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువుపై భర్త అన్న, మరదలి భర్త, ఓ తాంత్రికుడు కలిసి అత్యాచారం చేశారు. మూడు రోజులపాటు ఈ కిరాతకాన్ని సాగించారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న బాధితురాలికి కురుక్షేత్రకు చెందిన యువకుడితో వివాహమైంది. శోభనం రోజు యధావిధిగా గదిలోకి వెళ్లిన వధువుకు వరుడు మత్తుమందు కలిపిన పాలను ఇచ్చాడు. దీంతో స్పృహ కోల్పోయిన యువతిపై ఆమె భర్త అన్న, మరదలి భర్త (వరుసకు సోదరుడు), తాంత్రికుడు అత్యాచారానికి తెగబడ్డారు. మూడు రోజుల పాటు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. తన తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యువతికి తెలివి వచ్చింది. జరిగిన దారుణం గురించి తండ్రికి వివరించగా ఆయన కురుక్షేత్ర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ యువతి అత్తామామలు, ఆడపడుచులకు ఉన్న మూఢనమ్మకాలవల్లే ఈ ఘటన చోటు చేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హరియాణాలోని కురుక్షేత్రలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువుపై భర్త అన్న, మరదలి భర్త, ఓ తాంత్రికుడు కలిసి అత్యాచారం చేశారు. మూడు రోజులపాటు ఈ కిరాతకాన్ని సాగించారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న బాధితురాలికి కురుక్షేత్రకు చెందిన యువకుడితో వివాహమైంది. శోభనం రోజు యధావిధిగా గదిలోకి వెళ్లిన వధువుకు వరుడు మత్తుమందు కలిపిన పాలను ఇచ్చాడు. దీంతో స్పృహ కోల్పోయిన యువతిపై ఆమె భర్త అన్న, మరదలి భర్త (వరుసకు సోదరుడు), తాంత్రికుడు అత్యాచారానికి తెగబడ్డారు. మూడు రోజుల పాటు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. తన తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యువతికి తెలివి వచ్చింది. జరిగిన దారుణం గురించి తండ్రికి వివరించగా ఆయన కురుక్షేత్ర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ యువతి అత్తామామలు, ఆడపడుచులకు ఉన్న మూఢనమ్మకాలవల్లే ఈ ఘటన చోటు చేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
No comments:
Post a Comment