ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గట్టి షాక్ తగిలింది. బాబ్లీ కేసులో నాన్ బెయిల్ బుల్ వారెంట్ కు సంబంధించి ఆయనతోపాటు నోటీసులు అందుకున్న 16 మంది మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు రావాల్సిందేనని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫున ఆయన లాయర్లు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, గంగుల కమలాకర్, కేఎస్ రత్నంలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురు పోనూ చంద్రబాబుతో సహా మిగిలిన 16 మంది కోర్టుకు రావాల్సిందేనని తేల్చిచెప్పి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు మహారాష్ట్రలోని బాబ్లీకి వెళ్లి అధికారులపై దౌర్జన్యంగా ప్రవర్తించారని కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గట్టి షాక్ తగిలింది. బాబ్లీ కేసులో నాన్ బెయిల్ బుల్ వారెంట్ కు సంబంధించి ఆయనతోపాటు నోటీసులు అందుకున్న 16 మంది మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు రావాల్సిందేనని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరఫున ఆయన లాయర్లు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, గంగుల కమలాకర్, కేఎస్ రత్నంలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురు పోనూ చంద్రబాబుతో సహా మిగిలిన 16 మంది కోర్టుకు రావాల్సిందేనని తేల్చిచెప్పి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు మహారాష్ట్రలోని బాబ్లీకి వెళ్లి అధికారులపై దౌర్జన్యంగా ప్రవర్తించారని కేసు నమోదైన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment