డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పనిచేసేది డిసెంబర్ 31వరకే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 21, 2018

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పనిచేసేది డిసెంబర్ 31వరకే..


ప్రస్తుతం మనం వాడుతున్న డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకే పనిచేస్తాయని ఆయా బ్యాంకులు వెల్లడించాయి. ఇప్పటికే ఆ దిశగా ఖాతాదారులకు సందేశాలు కూడా పంపాయి. ప్రస్తుతం వాడుతున్న కార్డుల నుంచి చిప్ ఆధారిత కార్డులు పొందాలని వినియోగదారులకు సూచించాయి. ఇటీవలకాలంలో ఏటీఎం మోసాలు, ఆన్లైన్ నగదులో మోసాలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను క్లోన్ చేయడం వంటి మోసాలు జరుగుతుండటంతో వినియోగదారులు చిప్ ఆధారిత కార్డులు పొందాలని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం వాడుతున్న కార్డులు మ్యాగ్నటిక్ స్ట్రిప్ తో  రూపొందినవి. భద్రతపరంగా ఇవి అంత సురక్షితమైనవి కాకపోవడంతో చిప్ ఆధారిత కార్డులను బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి. ఇవి మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో పోలిస్తే మరింత సురక్షితమైనవి. ఈఎంవి చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు జనవరి 2016 నుంచే వినియోగంలో ఉన్నాయి. 2016 జనవరి 31 తర్వాత కొత్తగా ఖాతాలు తెరిచే కస్టమర్లకు చిప్‌ ఆధారిత కార్డులే అందించాలని ఆర్‌బీఐ సూచించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad