ప్రపంచ దేశాలకు మరోసారి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. తన శత్రుదేశం ఇరాన్ పై విధించిన ఆంక్షల్లో భాగంగా తనకు సహకరించని దేశాలపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేఫథ్యంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి తక్కువ ధరకే భారీ ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం ఇరాన్ లోని చాబహార్ రేవును కూడా సిద్ధం చేసింది. అక్కడి నుంచి చమురు ఉత్పత్తులను సముద్ర మార్గం ద్వారా త్వరగా ఇండియాకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా అమెరికా హెచ్చరికలపై ఆ దేశంతో మాట్లాడతామని భారత్ స్పష్టం చేసింది. ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి బయటకొచ్చేసిన అమెరికా ఈ ఏడాది నవంబరు నుంచి ఆ దేశ చమురు రంగంపై ఆంక్షలను అమలు చేయబోతోంది.
ప్రపంచ దేశాలకు మరోసారి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. తన శత్రుదేశం ఇరాన్ పై విధించిన ఆంక్షల్లో భాగంగా తనకు సహకరించని దేశాలపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేఫథ్యంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కోనుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి తక్కువ ధరకే భారీ ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం ఇరాన్ లోని చాబహార్ రేవును కూడా సిద్ధం చేసింది. అక్కడి నుంచి చమురు ఉత్పత్తులను సముద్ర మార్గం ద్వారా త్వరగా ఇండియాకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా అమెరికా హెచ్చరికలపై ఆ దేశంతో మాట్లాడతామని భారత్ స్పష్టం చేసింది. ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి బయటకొచ్చేసిన అమెరికా ఈ ఏడాది నవంబరు నుంచి ఆ దేశ చమురు రంగంపై ఆంక్షలను అమలు చేయబోతోంది.
No comments:
Post a Comment