తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఎన్నికల కమిటీల్లో కోమటిరెడ్డి సోదరులకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వల్ల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియతోపాటు పార్టీ సీనియర్ నాయకులపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విరుచుకపడ్డ విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజగోపాల్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో బ్రోకర్లు ఉన్నారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ ఆయన పేర్కొనడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి రాజగోపాల్రెడ్డి సోమవారం తన వివరణను షీల్డ్ కవర్లో అందజేశారు. దీంతో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తే సీనియర్ నాయకులపై సైతం చర్యలు తప్పవని పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఎన్నికల కమిటీల్లో కోమటిరెడ్డి సోదరులకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వల్ల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియతోపాటు పార్టీ సీనియర్ నాయకులపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విరుచుకపడ్డ విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజగోపాల్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో బ్రోకర్లు ఉన్నారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ ఆయన పేర్కొనడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి రాజగోపాల్రెడ్డి సోమవారం తన వివరణను షీల్డ్ కవర్లో అందజేశారు. దీంతో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తే సీనియర్ నాయకులపై సైతం చర్యలు తప్పవని పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment