నేడు 3,000 కి.మీ. మైలురాయిని దాటనున్న జగన్ పాదయాత్ర - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 24, 2018

నేడు 3,000 కి.మీ. మైలురాయిని దాటనున్న జగన్ పాదయాత్ర

jagan-padayatra @3000-km

సుమారు తొమ్మిది నెలలకు పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర నేడు విజయనగరం జిల్లాలో 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ సందర్భంగా అక్కడ ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి.. పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 2004లో నారా చంద్రబాబు  నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేరువై, వారి మద్దతుతో అధికారాన్ని సాధించగలిగారు. అదే పంథాలో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు.. 116 నియోజకవర్గాల్లోని 193 మండలాల్లో.. 1650 గ్రామాల మీదుగా 44 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల పరిధిలో పాదయాత్ర సాగింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad