గతంలో భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగాడు. విశాఖ ఎంపీగా కూడా వ్యవహరించాడు. గీతం యూనివర్సిటీ యాజమాన్యం వీరి కుటుంబానిదే. ఇప్పుడు బాలయ్య అల్లుడిగా భరత్ విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం విశాఖ ఎంపీ సీటు బీజేపీ చేతిలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేయగా.. విశాఖ ఎంపీ సీటు బీజేపీకి దక్కింది.
ఇక వచ్చే సారి బీజేపీ సోలోగా పోటీ చేయాల్సిందే. ఈ నేఫథ్యంలో విశాఖలో తెలుగుదేశం పార్టీ సొంత అభ్యర్థిని పెట్టుకోవాల్సి కూడా ఉంది. ఈ నేపథ్యంలో భరత్ కన్ను ఈ సీటు మీద పడిందని.. తెలుస్తోంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో లోకేష్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోపోటీ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే అటు బాలయ్య పెద్దల్లుడు, ఇటు చిన్నల్లుడు ఇద్దరూ పోటీలో ఉన్నట్టే!
No comments:
Post a Comment