అక్కినేని అఖిల్ సినిమాలో అతనికి జంటగా రాశి ఖన్నాని తీసుకున్నట్లు ప్రచారం. మద్రాస్ కేఫ్, ఊహలు గుసగుసలాడే, అనే సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయంలోనే మూవీ మేకర్స్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు కానీ హీరోయిన్గా మాత్రం రాశీ ఖన్నాని తీసుకున్నట్లుగా ఫిలింనగర్లో ఓ టాక్ నడుస్తోంది.
వివి వినాయక్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడని వార్తలొస్తున్నప్పటికీ.. స్పష్టతనిచ్చే అధికారిక ప్రకటనేదీ ఇంకా రాలేదు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లోగా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
No comments:
Post a Comment