తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 65 టికెట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీలను నిర్లక్ష్యం చేసినా, తక్కువ టికెట్లు కేటాయించినా ఆ పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ 105 టికెట్లు ప్రకటిస్తే, బీసీలకు 20 టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రకటించబోయే టికెట్లలో బీసీ నాయకుల పేర్లు లేవనే వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 65 టికెట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీలను నిర్లక్ష్యం చేసినా, తక్కువ టికెట్లు కేటాయించినా ఆ పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ 105 టికెట్లు ప్రకటిస్తే, బీసీలకు 20 టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రకటించబోయే టికెట్లలో బీసీ నాయకుల పేర్లు లేవనే వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.
No comments:
Post a Comment