రాజీనామా చేసిన జనసేన లక్ష్మినారాయణ సోదరుడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 19, 2019

రాజీనామా చేసిన జనసేన లక్ష్మినారాయణ సోదరుడు!


జనసేన పార్టీ నేత వీవీ లక్ష్మినారాయణ సోదరుడు  వీవీఎన్ రాజేంద్ర ప్రసాద్ ఎస్వీయూ వీసీ పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పద రీతిలో ఆయన నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. దాదాపు  నాలుగు నెలల కిందట ఎస్వీయూ వీసీగా నియమితం అయ్యారు రాజేంద్ర ప్రసాద్.

అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ఆశీస్సులతో ఆయన ఎస్వీయూ వీసీగా  నియమితం అయ్యారని తెలుస్తోంది. ఆయనకు వీసీగా వ్యవహరించే అర్హత లేదట. అయినా ఆయన ఆ పదవిని పొందారు. ఆ విషయంలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే అప్పటి అధికార పార్టీ అండతో ఆయన ఆ సీట్లో కూర్చున్నారు.

అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అండతో లక్ష్మినారాయణ సోదరుడు ఎస్వీయూ వీసీగా నియమితులయ్యారని ప్రచారం జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వానికే అప్పుడు ఫిర్యాదులు వచ్చినా వాటిని లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ పై చర్యలు తప్పవనే వార్తలు వచ్చాయి.

దీంతో ముందుగానే లక్ష్మినారాయణ సోదరుడు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. లక్ష్మినారాయణ ఏమో అప్పటికే జనసేనకు దగ్గరైనా టీడీపీ ప్రాపకంతో అక్రమ మార్గంలో ఆయన సోదరుడు వీసీ పదవిని పొందడం గమనార్హం!

No comments:

Post a Comment

Post Bottom Ad