అదిగో నరసింహన్ ను మార్చేస్తున్నారు.. ఇదిగో ఆయన ప్లేస్ లో మరొకరికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ గిరి దక్కబోతోంది.. అనే వార్తలు కొత్తవి ఏమీ కావు. ఇలాంటి వార్తలు సంవత్సరాల నుంచిని వస్తూ ఉన్నాయి. ఎప్పుడో ఎన్డీ తివారీ సెక్స్ స్కామ్ లో చిక్కుకుని రాజ్ భవన్ ను ఖాళీ చేసి వెళ్లిపోయినప్పుడు నరసింహన్ కు అవకాశం దక్కింది. అంత వరకూ ఐపీఎస్ గా హోం శాఖలో పని చేసిన అనుభం ఆయనను ఏకంగా గవర్నర్ ను చేసింది.
ఆ తర్వాత క్యాలెండర్లు మారిపోయాయి. ప్రభుత్వాలు కూడా మారిపోయాయి. అయితే నరసింహన్ ను మాత్రం కదిలించే వారు లేకుండా పోయారు. కేంద్రంలో యూపీఏ ఉన్నప్పుడు నరసింహన్ నియమితులు అయ్యారు. ఎన్డీయే వచ్చినా ఈయననే కొనసాగించింది. ఎన్డీయే రెండో సారి వచ్చినా నరసింహన్ కు మాత్రం తిరుగులేదని స్పష్టం అవుతోంది.
నరసింహన్ ను తప్పిస్తున్నారని, ఆయన స్థానంలో సుష్మా స్వరాజ్ ఏపీకి గవర్నర్ గా రాబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అవి ఉత్తివే అని తేలిపోయింది. వాటిని స్వయంగా సుష్మా స్వరాజ్ ఖండించారు. దీంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టే.
నరసింహన్ మరి కొంత కాలం ఏపీకి, తెలంగాణకు గవర్నర్ గా కొనసాగడం ఖాయమైనట్టే అని స్పష్టం అవుతోంది. మరి కొన్నాళ్లు గవర్నర్ హోదా నుంచి నరసింహన్ ను కదిలించగలిగే వాళ్లు ఎవరూ లేరేమో!
No comments:
Post a Comment