చంద్రబాబు మా మీద పడి ఎందుకు ఏడుస్తారు: పవన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 26, 2018

చంద్రబాబు మా మీద పడి ఎందుకు ఏడుస్తారు: పవన్


నిన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఘటనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని  రాజకీయ నాయకులు ఖండించారు. అయితే చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఈ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక డ్రామాగా అభివర్ణించారు. జగన్‌పై దాడిని ఖండించిన వారిపై పవన్, కేసీఆర్ లపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి విమర్శలపై జనసేన అధ్యక్షుడు పవన్ కు తిక్క లేచినట్టుంది. ట్వీటర్లో చంద్రబాబును ఉద్దేశించి మెసేజ్ పెట్టాడు. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారెందుకని ట్వీట్ చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad