అవార్డుల ఫంక్షన్లో రాశీ అందాలకు అభిమానులు ఫిదా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

అవార్డుల ఫంక్షన్లో రాశీ అందాలకు అభిమానులు ఫిదా



టాలీవుడ్ లో 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.. ఢిల్లీ అందగత్తె రాశీ ఖన్నా. ఆ సినిమా మంచి విజయం సాధించడంలో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిత్రం తర్వాత  గోపీచంద్ హీరోగా వచ్చిన 'జిల్', రవితేజ హీరోగా వచ్చిన 'బెంగాల్ టైగర్', సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'సుప్రీం', వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ', జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'జై లవకుశ'తో సూపర్ హిట్లు కొట్టింది. తెలుగులో చివరిగా నటించిన 'శ్రీనివాస కల్యాణం' అమ్మడిని పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో సిద్ధార్థ్ సరసన ఒక చిత్రం చేస్తోంది. ఎప్పటికప్పుడు తన తాజా చిత్ర విశేషాలను, వాటి అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో అందించే రాశీ వివిధ అవార్డుల ఫంక్షన్స్ లోనూ చురుగ్గా పాలుపంచుకుంటోంది. అక్కడ ప్రత్యేక గీతాలకు డ్యాన్సుల వేసి భారీగానే ఆర్జిస్తోంది. తాజాగా.. మిర్చిమ్యూజిక్ అవార్డుల్లో భాగంగా ఈ భామ రెడ్ కార్పెట్ పై నడిచి సందడి చేసింది. ధగధగా మెరిసిపోయే క్యాస్టూమ్స్ ధరించి అందరిలోనూ మెరిసిపోయింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad