విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఆదివారం కాల్చి చంపారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతోపాటు అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే అనుచరులకు కూడా గాయాలయ్యాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరి ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు.
విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఆదివారం కాల్చి చంపారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతోపాటు అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే అనుచరులకు కూడా గాయాలయ్యాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరి ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు.
No comments:
Post a Comment