హీరోయిన్లకు సమాన పారితోషికం ఇవ్వాలంటున్న కాజోల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

హీరోయిన్లకు సమాన పారితోషికం ఇవ్వాలంటున్న కాజోల్

హీరోయిన్లకూ హీరోలతోపాటు సమానంగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.. బాలీవుడ్ వెటరన్ నటి కాజోల్. బాలీవుడ్ లో హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ పారితోషికం ఇవ్వడం సరికాదని అంటోంది. స్టార్ హీరోల సినిమాల్లా హీరోయిన్ల సినిమాలు రూ.500 కోట్లు రాబట్టవని చెబుతోంది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. 'హెలికాప్టర్ ఈలా'. కథానాయిక ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కాజోల్ గాయకురాలిగా, ఓ బాలుడికి తల్లిగా కనిపించనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా కాజోల్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కాజోల్ పై వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమా బాక్సాఫీసు దగ్గర ఎంత వసూలుచేసిందనే దాని బట్టి పారితోషికం చెల్లిస్తున్నారని, ఇందులో నిర్మాతలను తప్పుబట్టాల్సిన అవసరం లేదంటోంది.


No comments:

Post a Comment

Post Bottom Ad