హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణపతుల విగ్రహాలు తరలివస్తున్నాయి. వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. నిమజ్జనం జరిగే ప్రాంతం అంతా జనంతో నిండి పోయింది. ఈ ఏడాది ట్యాంక్బండ్లోనే 16 వేల గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసి, ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటలోపే పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంక్బండ్ ఆరో నంబర్ క్రేన్ వద్ద శోభాయాత్ర ముగిసింది.
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణపతుల విగ్రహాలు తరలివస్తున్నాయి. వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. నిమజ్జనం జరిగే ప్రాంతం అంతా జనంతో నిండి పోయింది. ఈ ఏడాది ట్యాంక్బండ్లోనే 16 వేల గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసి, ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటలోపే పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంక్బండ్ ఆరో నంబర్ క్రేన్ వద్ద శోభాయాత్ర ముగిసింది.
No comments:
Post a Comment