ఇండస్ట్రీస్ లోనే కాదు.. ఇన్ కమ్ లోనూ.. ఇండియాలో నంబర్ వన్ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రూవ్ చేసుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఇండియన్ బిలియనీర్ల లిస్ట్ లో.. 21 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఫస్ట్ ప్లే లో ఉన్న ముఖేష్.. వాల్డ్ వైడ్ గా 39 వ ప్లేస్ లో కొట్టేశారు.
అటు వాల్డ్ వైడ్ గా ఫస్ట్ ప్లేస్ లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిలిచాడు . 79.2 బిలియన్ డాలర్ల ఇన్ కమ్ తో టాప్ పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నారు బిల్ గేట్స్. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా ఫోర్బ్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవడం బిల్ గేట్స్ కు ఇది పదహారోసారి.
బిల్ గేట్స్ తర్వాత స్థానాల్లో.. మెక్సికన్ బిజినెస్ మెన్ కార్లోస్ సిమ్.. 77.1 బిలియన్ డాలర్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ వారన్ బఫెట్.. 72.7 బిలియన్ డాలర్లతో థర్డ్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. టాప్ 50 లిస్ట్ లో… మరో ఇద్దరు ఇండియన్ బిలియనీర్లకు చోటు దక్కింది. సన్ ఫార్మా ఫౌండర్ దిలీప్ శాంఘ్వీ.. 20 బిలియన్ డాలర్ల ఆదాయంతో 44వ స్థానంలో ఉన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ.. 19 బిలియన్ డాలర్ల ఇన్ కమ్ తో 48వ ప్లేస్ నిలిచారు.
ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. లాస్ట్ ఇయర్ 1645 గా ఉన్న బిలియనీర్ల సంఖ్య.. ఈ ఏడాదికి 1826కు పెరిగింది. మహిళల్లో కూడా.. గత ఏడాది 172గా ఉన్న బిలియనీర్స్ నంబర్.. ఈ ఏడాది 197 వరకు వచ్చింది. అమెరికాలో 536 మంది.. యూరప్ లో 482 మంది ఉన్నారు. మిగతాచోట్లకంటే ఎక్కువగా ఏషియన్ పసిఫిక్ రీజియన్ లో 562 మంది బిలియనీర్లు ఉన్నట్టు ఫోర్బ్స్ తేల్చింది.
No comments:
Post a Comment