trisha and rana |
మలేషియాలో జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఈవెంట్ కు త్రిష, దగ్గుబాటి రానా కలిసి వెళ్లారు. ఇలా వీరిద్దరూ కలిసి వెళ్లటం ఇది రెండోసారి. గతంలో దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్ లోనూ వీరిద్దరూ కలిసే కనిపించారు. అయితే తాజాగా త్రిష....రానాతో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఆన్ బోర్డ్' అంటూ ఆ ఫోటోను త్రిష తన ట్విట్టర్ లో పెట్టింది. రానా, త్రిషల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ప్రచారం జరిగినా.. వీరిద్దరూ మాత్రం తాము మంచి స్నేహితులమేనంటూ పేర్కొంటుండటం విశేషం.
No comments:
Post a Comment