హైదరాబాద్ : ఇటీవల వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన టాలీవుడ్ నటి శ్వేతాబసు ప్రసాద్ కు బాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఆమెకు తన చిత్రంలో అవకాశం ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. గతేడాది ఈ దర్శకుడు రూపొందించిన 'షాహిద్' చిత్రం ఈయనకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును, కీర్తిని తెచ్చిపెట్టింది.
"నా తదుపరి చిత్రంలో శ్వేతా ప్రసాద్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె మంచి నటి. గతంలో 'మక్దీ' సినిమాలో ఆమె చాలా బాగా నటించింది. వ్యభిచారం కేసుకు సంబంధించి ఆమెను కొందరు టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అలాగే ఈ విషయంలో ఆమె ఫోటోలను ప్రచురించడం సమంజసం కాదు" అంటున్నాడు హన్సల్. కాగా, న్యాయస్థానం ఆదేశాలపై శ్వేతా ప్రస్తుతం హైదరాబాదులోని పునరావాస కేంద్రంలో వుంది. మరి, ఈ బాలీవుడ్ దర్శకుని ఆఫర్ పై ఆమె ఎలా స్పందిస్తుందో! | |||||
Post Top Ad
Saturday, September 06, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment