జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్... వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ను ఎన్.డి.ఎ అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచార సభలలో ఆయన మాట్లాడారు. జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై దాడి కొనసాగించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దోపిడీలు, కబ్జాలే ఉంటాయన్నారు. జగన్ ను విమర్శించిన పవన్ చంద్రబాబును కీర్తించారు. పాలనలో ఎంతో అనుభవం ఉందని, ఉత్తమ ముఖ్యమంత్రి అవార్డులు కూడా పొందారని పొగిడారు. మోడీని ఎవరు ఏమన్నా సహించేది లేదని ఆయన అన్నారు.
Post Top Ad
Sunday, May 04, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment