టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్కు పద్నాలుగేళ్ల క్రితమే కుమారుడు పుట్టాడని చంద్రబాబు ఒకప్పటి సన్నిహితుడు, యూరో లాటరీ వ్యవహారంలో నిందితుడు కోలా కృష్ణమోహన్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్కు సంబంధించి పలు గుట్లు రట్టు చేశారు. లోకేశ్ తన కుమారుడికి సంతోష్గా నామకరణం కూడా చేశారన్నారు. గతంలో లోకేష్ ఒక అమ్మాయితో వెళ్లిపోయారని, బెంగళూరులో కొంతకాలం సంసారం చేశారన్న విషయం తాను రెండేళ్ల కిందట చెప్పానని గుర్తుచేశారు. 1999లో వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడని, ఇప్పుడు ఆ బిడ్డకు 14 ఏళ్ల వయసుందని వెల్లడించారు. ఆ అమ్మాయి న్యాయం కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేసిందని, సీఎంగా ఉండి కూడాబాబు ఆ అమ్మాయికి న్యాయం చేయలేదన్నారు. ఈ విషయాలను రెండేళ్ల కిందట చెప్పినప్పుడు ఈ మాటలను చంద్రబాబుగానీ టీడీపీ వారుగానీ ఖండించలేదని గుర్తుచేశారు. తాను మీడియా ముందు మాట్లాడిన రెండు నెలల తరువాత ఆ అమ్మాయి తన అడ్రసు కనుక్కుని తన వద్దకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించిందన్నారు. తాను రెండు రోజుల్లో ఆమెను మీడియా ముందుకు తెస్తానని, భద్రతా కారణాల రీత్యా ఆమె పేరును, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతున్నానన్నారు. తాను ఆ అమ్మాయిని, లోకేశ్ కుమారుడు సంతోష్ను మీడియా ముందుకు తెచ్చిన తరువాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, దీంతో వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. తనకు అధికారమిస్తే మూడు నిమిషాల్లో వచ్చి ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తానని గొప్పలు చెబుతున్న చంద్రబాబు స్వయానా తన కోడలికే న్యాయం చేయలేకపోతున్నారని కోలా విమర్శించారు. ఆ అమ్మాయిని దూరం చేయడానికే లోకేశ్ను అప్పట్లో అమెరికాకు చదువుల కోసం పంపారన్నారు. ఇదేమీ రహస్యం కాదని లోకేశ్ వ్యవహారం అందరికీ తెలిసిందేనని, ఒక పోలీసు అధికారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్కు పద్నాలుగేళ్ల క్రితమే కుమారుడు పుట్టాడని చంద్రబాబు ఒకప్పటి సన్నిహితుడు, యూరో లాటరీ వ్యవహారంలో నిందితుడు కోలా కృష్ణమోహన్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్కు సంబంధించి పలు గుట్లు రట్టు చేశారు. లోకేశ్ తన కుమారుడికి సంతోష్గా నామకరణం కూడా చేశారన్నారు. గతంలో లోకేష్ ఒక అమ్మాయితో వెళ్లిపోయారని, బెంగళూరులో కొంతకాలం సంసారం చేశారన్న విషయం తాను రెండేళ్ల కిందట చెప్పానని గుర్తుచేశారు. 1999లో వారిద్దరికి ఒక కుమారుడు పుట్టాడని, ఇప్పుడు ఆ బిడ్డకు 14 ఏళ్ల వయసుందని వెల్లడించారు. ఆ అమ్మాయి న్యాయం కోసం చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేసిందని, సీఎంగా ఉండి కూడాబాబు ఆ అమ్మాయికి న్యాయం చేయలేదన్నారు. ఈ విషయాలను రెండేళ్ల కిందట చెప్పినప్పుడు ఈ మాటలను చంద్రబాబుగానీ టీడీపీ వారుగానీ ఖండించలేదని గుర్తుచేశారు. తాను మీడియా ముందు మాట్లాడిన రెండు నెలల తరువాత ఆ అమ్మాయి తన అడ్రసు కనుక్కుని తన వద్దకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరించిందన్నారు. తాను రెండు రోజుల్లో ఆమెను మీడియా ముందుకు తెస్తానని, భద్రతా కారణాల రీత్యా ఆమె పేరును, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతున్నానన్నారు. తాను ఆ అమ్మాయిని, లోకేశ్ కుమారుడు సంతోష్ను మీడియా ముందుకు తెచ్చిన తరువాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, దీంతో వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. తనకు అధికారమిస్తే మూడు నిమిషాల్లో వచ్చి ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తానని గొప్పలు చెబుతున్న చంద్రబాబు స్వయానా తన కోడలికే న్యాయం చేయలేకపోతున్నారని కోలా విమర్శించారు. ఆ అమ్మాయిని దూరం చేయడానికే లోకేశ్ను అప్పట్లో అమెరికాకు చదువుల కోసం పంపారన్నారు. ఇదేమీ రహస్యం కాదని లోకేశ్ వ్యవహారం అందరికీ తెలిసిందేనని, ఒక పోలీసు అధికారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని ఆరోపించారు.
No comments:
Post a Comment