ప్రచారంలో చిరంజీవికి పంచ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 23, 2014

ప్రచారంలో చిరంజీవికి పంచ్!


ఎన్నికల సమయంలో మన రాజకీయ నేతలు తమ ఊకదంపుడు ఉపన్యాసాలతో జనాల చెవుల్లో లౌడ్ స్పీకర్లు బిగించే సంగతి తెలిసిందే. అయితే ఒక్కోసారి మన నేతలు బిత్తరపోయే సన్నివేశాలు వారికి ఎదురవుతుంటాయి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల బస్సుయాత్రలో పాల్గొన్న చిరంజీవికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. జోరు మీదున్న చిరంజీవిని ఒక సామాన్య కార్యకర్త (పీఆర్పీ) నిలదీసే సరికి ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి బస్సెక్కాల్సి వచ్చింది. పార్టీ కాంగ్రెస్ కు అమ్ముకుని ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్ అంటూ ప్రశ్నించే సరికి చిరంజీవి బిత్తరపోయాడు. అంతేకాకుండా పీఆర్పీ ఇచ్చిన గుర్తింపు కార్డును అక్కడే చింపేశాడు. నీ కళ్లముందే చింపేస్తున్నాను. అయితే తర్వాత ‘పవన్‌ కల్యాణ్ జిందాబాద్, జనసేన వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేయడం విశేషం. బస్సు యాత్రలో పక్కనే కేంద్రమంత్రులు పల్లంరాజు, పనబాక లక్షి, జె.డి.శీలం, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు చిరంజీవి పక్కనే ఉన్నారు.

1 comment:

  1. http://powrudu.blogspot.com/

    మార్పు జనం తోటే సాద్యం ,వక్క సరిగా సమాజం చెడుని పారద్రోలలేము .

    ఎంచే లంచేలుగా సమాజం లో మార్పు జనం మంచి ఆలోచన ,నడవడిక మూలం గానే వస్తుంది .

    గవర్నమెంట్ సొమ్ము లో
    రూపాయలో తొంబై తొమ్మది పైసలు అక్రమంగా సొంతానికి ఆస్తులు కొనుకొంటు తినేసి ,సమాజ అబివృద్ది కి వక పైసా కర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారి వై .ఎస్ .అర్ పార్టీ తో జాగ్రత్త గా వుండండి .

    గతం లో సమాజ సేవ , అబివృద్ది తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అని జనం గ్రహించాలి .


    బయం వద్దు , అందరు కలసి కట్టుగా చెడును విబేదించండి.ఎంతె మందిని బెదిరిస్తారు, వక్కడిని బేదిరించగలరు ,వంద మందిని బెదిరించాగలరా .

    ReplyDelete

Post Bottom Ad