ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నందమూరి నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్న్ర హరికృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటలీ కోసమే.. తెలంగాణ
ఇండియా పటంలో ఇటలీని రోజూ చూసుకోవాలనే స్వార్థంతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టిందన్నారు. తెలంగాణ మినహాయించిన రాష్ట్ర పటంలో సీమాంధ్ర ప్రాంతాలు కలిసి ఇటలీని పోలి ఉంటాయని ఆయన తెలిపారు.
మహోద్యమంలో భాగమైనప్పుడు... బంధుత్వాలకు తావుండదన్నారు. బాలయ్య ఇంట్లో పెళ్లికి వెళ్లని దానికి సమాధానంగా.. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లిళ్లకు తన తండ్రి ఎన్టీఆర్ హాజరు కాలేదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. తన పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు తప్పుడువన్నారు. తను కూడా తొలుత తప్పుగా ఉన్న ఫార్మాట్లో ఉన్న రాజీనామా లేఖపై సంతకం చేసి.... అయితే ఆ తర్వాత ఆ ఫార్మెట్ తప్పు అని తేలడంతో మరో రాజీనామా చేశారు.
No comments:
Post a Comment