మారుతున్న దిగ్విజయ్ మాటతీరు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 05, 2013

మారుతున్న దిగ్విజయ్ మాటతీరు!


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే ప్రసక్తే లేదని నిత్యం చెబుతూ వస్తున్న దిగ్విజయ్‌సింగ్ మాటతీరులో బుధవారం కాస్త మార్పు కన్పించింది. రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు తాము ప్రాధాన్యమిస్తామని ఆయన అన్నారు. కిరణ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సీమాంధ్రలో ప్రజాందోళనలు తగ్గడం లేదుగా అని ప్రశ్నించగా పై విధంగా బదులిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తమకు తెలుసు అని చెప్పారు. ప్రజలు రెండుమార్లు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. కేంద్రంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారకులైన వారికి ఎలా అన్యాయం చేస్తాం? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి, అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad