KTR |
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనను తాము ఒప్పుకోం అని ఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే సంబరం, లేదంటే సమరమేనని హెచ్చరించారు. తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్కు త్వరలోనే టులెట్ బోర్డు పెట్టుకోవాలన్నారు. ఏపీఎన్జీవోల సభ అనుమతిపై డీజీపీ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదన తెస్తే ఎంఐఎంతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.
No comments:
Post a Comment