నగదు బదిలీ పథకం ద్వారా 'మీ డబ్బు మీ చేతికి' చేరుతుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. శనివారం ఆయన చంద్రగిరి సభలో మాట్లాడుతూ వంద రోజుల్లో నగదు బదిలీ పథకం అమలు కాబోతుందన్నారు. రాష్ట్రంలోని చిత్తూరుతో పాటు నిజామాబాద్, నల్గొండ ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం,గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో తర్వలోనే
నగదు బదిలీ పథకం ద్వారా లబ్దిదారులకు డబ్బు చేరబోతుందని జైరాం రమేష్ వెల్లడించారు. ఇక నుంచి ఎవరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment