ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే పదకొండు జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.50 కోట్లు, పార్లమెంటరీ నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఖర్చుపెట్టే అవకాశమున్న నేపథ్యంలో జగన్ కూడా తన పార్టీలో ఆర్థికంగా బలమున్న నేతల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగున్నరేళ్ల నుంచి ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ఉన్నవారిని సైతం పక్కకు తప్పిస్తున్నారు లేదా వారే తప్పుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో కందుల దుర్గేశ్, విశాఖపట్నంలో జిల్లాలో కర్రి సీతారాం, కోలా గురువులు, నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తదితరులంతా వైఎస్ జగన్ పై ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఎప్పటి నుంచో నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరేవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, రూ.50 కోట్లు ఖర్చుపెట్టగలిగే స్తోమత ఉంటేనే టికెట్ ఇస్తానని ఖరాఖండిగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే పదకొండు జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.50 కోట్లు, పార్లమెంటరీ నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఖర్చుపెట్టే అవకాశమున్న నేపథ్యంలో జగన్ కూడా తన పార్టీలో ఆర్థికంగా బలమున్న నేతల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగున్నరేళ్ల నుంచి ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ఉన్నవారిని సైతం పక్కకు తప్పిస్తున్నారు లేదా వారే తప్పుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో కందుల దుర్గేశ్, విశాఖపట్నంలో జిల్లాలో కర్రి సీతారాం, కోలా గురువులు, నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తదితరులంతా వైఎస్ జగన్ పై ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఎప్పటి నుంచో నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరేవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, రూ.50 కోట్లు ఖర్చుపెట్టగలిగే స్తోమత ఉంటేనే టికెట్ ఇస్తానని ఖరాఖండిగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment