ఇందూటెక్ కంపెనీకి – మారిషస్ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదంలో భారత ప్రభుత్వానికి నోటీసుల విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని పత్రికలలో వచ్చిన కథనాలకు సాక్షి మీడియా సమాధానం ఇచ్చింది. సంబంధం లేని వ్యవహారంలో జగన్ ను ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొంది. జగన్ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నోటీసులు వచ్చాయంటూ దీనికి జగన్ కారణమంటూ కొన్ని మీడియాల్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కేవలం కుట్రపూరిత ఆరోపణలేనని సాక్షి మీడియా అభిప్రాయపడింది. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని తక్కువ చేసి చూపడానికే చంద్రబాబు మీడియాను వాడుకుంటూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వాపోయింది.
సాక్షి సమాధానం!
మారిషస్కి చెందిన ‘కరిస్సా ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి’ అనే కంపెనీ ఇందూటెక్లో పెట్టుబడులు పెట్టింది. ఇందూకు కేటాయించిన భూమిని సీబీఐ కేసు సందర్భంగా ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో తనకు నష్టం వచ్చిందంటూ మారిషస్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు అందాయి. ఇది సర్వసాధారమే. నోటీసుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఏమీ ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయానికి నోటీసు వస్తుంది. ఆర్బిట్రేషన్ కోసం అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడి కంపెనీలపై భారత ప్రభుత్వానికి పంపించే నోటీసులన్నీ అలాగే వస్తాయి. వొడాఫోన్, రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ గ్యాస్ రేట్లకు సంబంధించిన కేసులో కూడా ఆర్బిట్రేషన్ నోటీసులు ప్రధానమంత్రికి అందాయి. ఇవన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ సంబంధమే లేని రెండు కంపెనీలకు చెందిన ఒక వ్యవహారంలో జగన్ కు ఆపాదిస్తూ జగన్ వల్లనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నోటీసులు వచ్చాయన్నట్లు విషప్రచారానికి బాబు దిగజారారని ఆరోపించింది. అయినా రెండు కంపెనీల వ్యవహారానికి జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం? అని ప్రశ్నించింది. మారిషస్ కంపెనీకి, ఇందూటెక్ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందంలో జగన్ ఎక్కడున్నారు? ఇందూటెక్లో మారిషస్ కంపెనీ పెట్టుబడులకు జగన్ బాధ్యత వహించాలా. . ? ఆ రెండు కంపెనీలలో దేనిలోనూ జగన్ భాగస్వామి కానపుడు ఆ రెండు కంపెనీల మధ్య సమస్య తలెత్తితే జగన్ ఏం చేయాలి? సంబంధమే లేని రెండు కంపెనీల వివాదాన్ని జగన్ కు ఆపాదించడమంటే మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టడం కాదూ. . జగన్పై మోపిన అక్రమ కేసుల్లో ఇందూ టెక్ ఉంది కాబట్టి. . ఆ ఇందూటెక్పై ఏదో కేసు వచ్చింది కాబట్టి దానికి కాస్త మసాలా జోడించి జగన్ అకౌంట్లో వేసేందుకు కొన్ని పత్రికల ద్వారా చంద్రబాబు మాస్టర్ గేమ్ ఆడుతున్నట్లు సాక్షి పేర్కొంది.
సాక్షి సమాధానం!
మారిషస్కి చెందిన ‘కరిస్సా ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి’ అనే కంపెనీ ఇందూటెక్లో పెట్టుబడులు పెట్టింది. ఇందూకు కేటాయించిన భూమిని సీబీఐ కేసు సందర్భంగా ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో తనకు నష్టం వచ్చిందంటూ మారిషస్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు అందాయి. ఇది సర్వసాధారమే. నోటీసుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఏమీ ఉండదు. ప్రధానమంత్రి కార్యాలయానికి నోటీసు వస్తుంది. ఆర్బిట్రేషన్ కోసం అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడి కంపెనీలపై భారత ప్రభుత్వానికి పంపించే నోటీసులన్నీ అలాగే వస్తాయి. వొడాఫోన్, రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ గ్యాస్ రేట్లకు సంబంధించిన కేసులో కూడా ఆర్బిట్రేషన్ నోటీసులు ప్రధానమంత్రికి అందాయి. ఇవన్నీ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. కానీ సంబంధమే లేని రెండు కంపెనీలకు చెందిన ఒక వ్యవహారంలో జగన్ కు ఆపాదిస్తూ జగన్ వల్లనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నోటీసులు వచ్చాయన్నట్లు విషప్రచారానికి బాబు దిగజారారని ఆరోపించింది. అయినా రెండు కంపెనీల వ్యవహారానికి జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం? అని ప్రశ్నించింది. మారిషస్ కంపెనీకి, ఇందూటెక్ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందంలో జగన్ ఎక్కడున్నారు? ఇందూటెక్లో మారిషస్ కంపెనీ పెట్టుబడులకు జగన్ బాధ్యత వహించాలా. . ? ఆ రెండు కంపెనీలలో దేనిలోనూ జగన్ భాగస్వామి కానపుడు ఆ రెండు కంపెనీల మధ్య సమస్య తలెత్తితే జగన్ ఏం చేయాలి? సంబంధమే లేని రెండు కంపెనీల వివాదాన్ని జగన్ కు ఆపాదించడమంటే మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టడం కాదూ. . జగన్పై మోపిన అక్రమ కేసుల్లో ఇందూ టెక్ ఉంది కాబట్టి. . ఆ ఇందూటెక్పై ఏదో కేసు వచ్చింది కాబట్టి దానికి కాస్త మసాలా జోడించి జగన్ అకౌంట్లో వేసేందుకు కొన్ని పత్రికల ద్వారా చంద్రబాబు మాస్టర్ గేమ్ ఆడుతున్నట్లు సాక్షి పేర్కొంది.
No comments:
Post a Comment