బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాతో కలసి కారులో అమృత్సర్కు వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. శిల్పాశెట్టి సెక్యూరిటీ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే శిల్పా బౌన్సర్లు, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. అక్కడితో వదిలేయకుండా అజాగ్రత్తగా కారు నడుపుతూ ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని శిల్పాశెట్టి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేసింది!!
No comments:
Post a Comment