రైతులకు రుణమాఫీ :ఆర్థిక మంత్రి ఈటెల - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 04, 2014

రైతులకు రుణమాఫీ :ఆర్థిక మంత్రి ఈటెల

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీకి కట్టుబడి ఉందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరామని తెలిపారు. సోమవారంలోపు పూర్తి వివరాలు వస్తాయన్నారు. 2013-2014 సంవత్సరంలో తీసుకున్న పంటరుణాల్లో రూ.లక్షలోపు వరకే రైతులకు రుణ మాఫీ అవుతుందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు, రుణమాఫీకి సంబంధం లేదని ఆయనా తెలిపారు.కొత్తరుణాలు అందించడానికి బ్యాంకర్లను సిద్ధం కావాలని ఆదేశించారు. బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad