సబితకు సీటు దక్కదా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, March 27, 2014

సబితకు సీటు దక్కదా?


సార్వత్రిక ఎన్నికల్లో మాజీ హోంమంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల నుంచి లోక్ సభ సీటు సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కుటుంబానికి ఒకే సీటు సూత్రాన్ని పాటించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మాజీ మంత్రి తన కుమారుడి సీటు కోసం తన స్థానాన్ని త్యాగం చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నుంచి పోటీ చేసే నేత ఎవరోనని ఉత్కంఠగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీచేస్తే, ఆయన భార్య పద్మావతికి కోదాడ టిక్కెట్ లభిస్తుందని సమాచారం. కాబట్టి సబితకు మహేశ్వరం నుంచి టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad