లోకేష్ ఓడతాడు అని చంద్రబాబుకు ముందే తెలుసు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 19, 2019

లోకేష్ ఓడతాడు అని చంద్రబాబుకు ముందే తెలుసు!


నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారు అని ఆయన తండ్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసు అని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు ఏమిటో తెలియడం లేదంటూ చంద్రబాబుతో సహా ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్పందించారు. ఇంకా వివిధ అంశాల గురించి కూడా ఆయన ట్వీట్ చేశారు.

''ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారు. ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లిచ్చారు. పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కంట్రాక్లర్ల బిల్లులు చెల్లించారు.ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ నంగనాచి డ్రామాలు.


రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు. తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలి.

నదులు, ప్రకృతి వనరులు చంద్రబాబుకు సొంత సంపదలా కనిపిస్తాయి. అందుకే కృష్ణా నదిని పూడ్చి కట్టిన ఇంట్లో నిస్సిగ్గుగా నివాసం ఉంటున్నారు. ఏమాత్రం సామాజిక బాధ్యత ఉన్నా తక్షణం ఆ ఇంటిని ఖాళీ చేసి ఆక్రమణల తొలగింపునకు సాయపడాలి. పంచభూతాలను చెరబట్టిన నీచపు చరిత్రను మూటకట్టుకున్నారు.'' అంటూ వరస ట్వీట్లలో ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి.

No comments:

Post a Comment

Post Bottom Ad