కేంద్ర హోంమంత్రిని కలిసిని వైఎస్సార్‌సీపీ నేతలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 29, 2018

కేంద్ర హోంమంత్రిని కలిసిని వైఎస్సార్‌సీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నేతలు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. తిత్లీ తుఫాన్‌తో అతాలకుతలమైన శ్రీకాకుళంను, బాధితులకు తక్షణ సాయం అందించాలని కోరారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం జరుగుతోందని వారు హోంమంత్రికి వివరించారు. చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలను సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్త సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌ ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad